దివ్యాంగులైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు
దివ్యాంగులైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సెలవు సంవత్సరానికి గరిష్టంగా 7 రోజులు ఉంటుంది. వైకల్యం, అభివృద్ధికి సంబంధించిన సమావేశాలు, సెమినార్లు, శిక్షణలు, వర్క్షాప్లు, జాతీయ, రాష్ట్ర స్థాయి ఏజెన్సీలు నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొనడానికి ఈ సెలవు ఉపయోగపడుతుంది.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దివ్యాంగులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇలాంటి సెలవులను మంజూరు చేసిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ (APSJSC) సమావేశంలో ఉద్యోగ సంఘాలు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
7 రోజుల కంటే ఎక్కువ సెలవు కావాలంటే, అది సాధారణ సెలవుగా పరిగణించబడుతుంది. ఈ ప్రత్యేక సాధారణ సెలవును సాధారణ సెలవులతో కలిపి తీసుకోవడానికి కూడా అనుమతి ఉంది. సంబంధిత సెలవు మంజూరు చేసే అధికారి ఈ సెలవును మంజూరు చేస్తారు. ఈ ఉత్తర్వులను అమలు చేయడానికి సంబంధిత శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మంచి సమాచారం
రిప్లయితొలగించండి