మరణించిన ఉద్యోగుల, పింఛను దారుల అంత్యక్రియల ఖర్చుల చెల్లింపు
ఉద్యోగులు
మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల అంత్యక్రియల ఖర్చుల చెల్లింపు రూ. 25,000/-.
అంత్యక్రియల ఖర్చులకు సంబంధించిన డీటెయిల్డ్ మరియు సబ్-డీటెయిల్డ్ హెడ్ 310/318 (G.O.Ms.No.60).
పింఛనుదారులు
సర్వీస్ పింఛనుదారుడు మరణిస్తే, అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ. 25,000/- చెల్లిస్తారు.
సర్వీస్ పింఛనుదారుని జీవిత భాగస్వామి మరణించినా రూ. 25,000/- చెల్లిస్తారు.
కుటుంబ పింఛనుదారుడు కూడా అంత్యక్రియల ఖర్చులకు అర్హులు.
ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేసినా, ఇంకా పింఛను ప్రయోజనాలు అందకపోతే, అటువంటి ఉద్యోగి అంత్యక్రియల ఖర్చులను అతను పదవీ విరమణ చేసిన DDO (డిస్బర్సింగ్ ఆఫీసర్) 2071- పింఛను హెడ్కు డెబిట్ చేసి చెల్లిస్తారు.
కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు
01.08.2018 నుండి కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తూ మరణిస్తే, వారికి కూడా ఈ పథకాన్ని ప్రభుత్వం పొడిగించింది.
కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు రూ. 15,000/- అంత్యక్రియల ఖర్చులకు అర్హులు.
అంత్యక్రియల ఖర్చులకు సంబంధించిన డీటెయిల్డ్ మరియు సబ్-డీటెయిల్డ్ హెడ్ 300-301/302.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి