ఉద్యోగుల బదిలీల పురోగతి పై రోజు వారీ నివేదికలు కోరిన సాధారణ పరిపాలనా శాఖ (GAD)
అమరావతి, జూన్ 2, 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని సడలించిన గడువును జూన్ 9, 2025 వరకు పొడిగించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన (GPM & AR) శాఖ ముఖ్య కార్యదర్శ ఒక U.O. నోట్ (నెం. 10599203/G.A. (AR)/2025, తేది 02.06.2025) విడుదల చేశారు.
వాస్తవానికి, ప్రభుత్వం G.O.Ms.No.23, ఆర్థిక (HR.I-PLG & పాలసీ) శాఖ, తేది 15.05.2025 ద్వారా మే 16, 2025 నుండి జూన్ 2, 2025 వరకు ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేసింది. ఇప్పుడు G.O.Ms.No.30, ఆర్థిక (HR.I-PLG & పాలసీ) శాఖ, తేది 02.06.2025 ద్వారా ఈ గడువును జూన్ 9 వరకు పొడిగించారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, బదిలీల ప్రక్రియ మొత్తాన్ని జూన్ 9, 2025 నాటికి అన్ని విభాగాలు పూర్తి చేయాలని, ఈ ప్రక్రియను స్పెషల్ చీఫ్ సెక్రటరీలు/ప్రిన్సిపల్ సెక్రటరీలు/సెక్రటరీలు పర్యవేక్షించాలని ఆదేశించారు. బదిలీలపై నిషేధం సడలింపు ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించబడదని స్పష్టం చేశారు.
ప్రతిరోజూ బదిలీల పురోగతి నివేదికను మరుసటి రోజు ఉదయం 11:00 గంటలలోపు ముఖ్యమంత్రి పరిశీలన కోసం సమర్పించాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో, అన్ని స్పెషల్ చీఫ్ సెక్రటరీలు/ప్రిన్సిపల్ సెక్రటరీలు/సెక్రటరీలను ప్రతిరోజూ ఉదయం 10:00 గంటలలోపు gad.arsection@gmail.com ఈ-మెయిల్ ఐడికి ఎక్సెల్ ఫార్మాట్లో కింది వివరాలతో సమాచారం అందించాలని కోరారు:
- నివేదిక తేదీ
- సెక్రటేరియట్ శాఖ పేరు
- నివేదిక తేదీ నాటికి పురోగతి
- కాంపిటెంట్ అథారిటీ (ప్రభుత్వ స్థాయి, HOD స్థాయి, జిల్లా స్థాయి)
- బదిలీలు పూర్తయ్యాయా (అవును/కాదు)
- అవును అయితే, బదిలీ అయిన ఉద్యోగుల సంఖ్య
- కాదు అయితే, బదిలీలన్నీ ఎప్పటిలోగా పూర్తవుతాయి.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి