మే 22, 2025

వెలుగు కమ్యూనిటీ సర్వేయర్ల సేవలు రద్దు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వే, సెటిల్మెంట్లు మరియు భూ రికార్డుల శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వెలుగు కమ్యూనిటీ సర్వేయర్ల సేవలను తక్షణమే ఉపసంహరించుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సర్వే, సెటిల్మెంట్లు మరియు భూ రికార్డుల డైరెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి, I.A.S. అన్ని జిల్లాల సర్వే & ల్యాండ్ రికార్డ్స్ అధికారులకు లేఖ ద్వారా తెలియజేశారు.

పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి (RD.I) శాఖ జారీ చేసిన G.O.Rt.No.261 తేదీ 15.04.2025 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు. సేవలు ఉపసంహరించుకున్న వెలుగు కమ్యూనిటీ సర్వేయర్లు SERPలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

అన్ని జిల్లాల DS&LROలు తమ జిల్లాల్లో పనిచేస్తున్న కమ్యూనిటీ సర్వేయర్లందరినీ తక్షణమే రిలీవ్ చేసి, డైరెక్టర్, SERP ముందు రిపోర్ట్ చేయాలని, ఆ విషయాన్ని ధృవీకరించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. 


లేఖ ప్రతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి